Friday, July 5, 2024

ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో విద్యార్థిని ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఒడిస్సాకు చెందిన మమత నాయక్ అనే
విద్యార్థిని మంగళవారం ఉదయం క్యాంపస్ రూమ్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News