Sunday, September 8, 2024

గిల్ సెంచరీ మిస్.. టీమిండియాకు భారీ ఆధిక్యం

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్- భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభం అయ్యింది. ఆదివారం కుల్దీప్ యాదవ్ తో ఆటను ప్రారంభించిన శుభ్ మన్ గిల్(91) సెంచరీ మిస్ చేసుకున్నాడు. లేని పరుగు కోసం వెళ్లి రనౌట్ అయ్యాడు. అనంతరం రిటైర్డ్ ఔట్ గా వెనుదిరిగిన యశస్వి జైశ్వాల్ క్రీజులోకి వచ్చాడు.

ప్రస్తుతం టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 76 ఓవర్లలో 276 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(129), సర్ఫరాజ్ ఖాన్(4)లు ఉన్నారు. ఇప్పటివరకు భారత్, ఇంగ్లండ్ పై 402 పరుగుల ఆధిక్యం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News