Friday, September 20, 2024

భారత్ లో 45,903 పాజిటివ్ కేసులు….

- Advertisement -
- Advertisement -

India corona active cases today

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి 50 వేల లోపు కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 45,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 490 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 85.53 లక్షలకు చేరుకోగా 1.26 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 79.17 లక్షల మంది కోలుకోగా 5.09 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. రోజు రోజుకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కంటే కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గుతోందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News