- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు 34 లక్షలను దాటాయి. దేశంలో గత 24 గంటల్లో 76,472 కొత్త కోవిడ్-19 కేసులు, 1,021 మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో ఇండియాలో మొత్తం కరోనా కేసులు 34,63,973కి పెరిగాయి. వీటిలో 7,52,424 యాక్టివ్ కేసులుండగా… ఇప్పటివరకు ఈ మహమ్మారితో 26,48,999మంది బాధితులు కోలుకుని నయమైయ్యారు. అటు ఇండియాలో కరోనా కేసుల రికవరీ రేటు 76.47 శాతంగా ఉంది. కరోనా వైరస్ తో దేశవ్యాప్తంగా 62,550 మంది మరణించినట్టు ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.
India COVID 19 cases tally crosses 34 lakh mark
- Advertisement -