Sunday, September 22, 2024

దేశంలో కరోనా ఉగ్రరూపం.. 5 లక్షలు దాటిన పాజిటీవ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 18,552 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, 384 మంది కరోనాతో మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 5,08,953కు చేరింది. కరోనా వైరస్‌తో ఇప్పటివరకు భారత్‌లో 15,685 మంది ప్రాణాలు కోలోయారు. ప్రస్తుతం దేశంలో 1,97,387 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతునారు.ఇక, కరోనా వైరస్ నుంచి 2,95,885 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 79,96,707 కరోనా పరీక్షలు చేసినట్లు ఐసిఎంఆర్ తెలిపింది.

India Crosses 5 lakh Corona Cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News