Wednesday, October 16, 2024

టీ20 క్రికెట్ లో చరిత్ర సృష్టించిన భారత్

- Advertisement -
- Advertisement -

టీ20 క్రికెట్ లో భారత్ చరిత్ర సృష్టించింది. శనివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మూడో చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా రికార్డు విజయం సాధించింది. దీంత మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్రమంలోనే భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పంది.

టీ20ల్లో అత్యధిక సిరీస్ లు క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇప్పటివరకు మొత్తం 34 టీ20 సిరీస్ లు ఆడిన భారత్ 10 సిరీస్ ల్లో ప్రత్యర్థి జట్టును వైట్ వాష్ చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్ 8, అఫ్గనిస్థాన్ 6, ఆస్ట్రేలియా 5, ఇంగ్లండ్ 4 టీ20 సిరీస్ లను క్లీన్ స్వీప్ చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News