Monday, April 28, 2025

గడిచిన 24 గంటల్లో 3,720 కేసులు నమోదు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,720 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా 20మంది ప్రాణాలు కోల్పోగా.. 7,698 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో మరణించివారి సంఖ్య 5,31,584కు చేరుకుంది.

తాజా కేసులతో ఇప్పటివరకు దేశంలో పాజిటీవ్ కేసులు సంఖ్య 4.49 కోట్లలు దాటింది. ప్రస్తుతం దేశంలో 40,177 క్రియాశీలక(యాక్టివ్) కేసులు ఉన్నాయి. కాగా, దేశంలో కరోనా రికవరీ శాతం 98.73గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News