Sunday, February 23, 2025

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India Reports 1569 new corona cases

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,569 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. దీంతో నిన్నటి కేసుల కంటే దాదాపు 28.7 శాతం కరోనా కేసులు తగ్గినట్లు తెలిపింది. కరోనాతో మరో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో మొత్తం కేసులు 4.31కోట్లకు చేరాయి. గత 24 గంటల్లో 917 మంది వైరస్‌ నుంచి బయటపడగా.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4.25కోట్ల మందికి పైగా బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,24,260 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 16,400 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 191కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

India Reports 1569 new corona cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News