Saturday, September 21, 2024

దేశంలో కొత్తగా 18,711 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India reports 18711 New COVID-19 cases

న్యూఢిల్లీ : భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ మళ్లీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 18,711 మందికి కరోనా వైరస్ సోకగా, 100 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 14,392 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,10,799కి పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,08,68,520 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇండియాలో ఇప్పటివరకు 1,57,756 మంది కరోనాతో మృతి చెందగా,  ప్రస్తుతం 1,84,523 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటివరకు 2,09,22,344 మందికి మందికిపైగా కరోనా టీకాలు వేసినట్టు అధికారులు వెల్లడించారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News