Monday, March 31, 2025

భారత్‌లో కొత్తగా 752 కరోనా కేసులు.. నిన్నటి కంటే రెట్టింపు

- Advertisement -
- Advertisement -

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 752 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అధికంగా కేరళలో 266 కేసులు రికార్డు అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో 8, ఆంధ్రప్రదేశ్ లో 8 కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో 4 మరణాలు సంభవించాయి. కేరళలో ఇద్దరు చనిపోగా, కర్నాటకలో, రాజస్థాన్ లో ఒకరు చొప్పున మరణించారు. తాజా కేసులతో కలిపి దేశంలో 3420 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా JN.1 కొత్త వేరియంట్ అధికారులు, ఆరోగ్య నిపుణులలో ఆందోళనలను పెంచుతోంది. ఇటీవలి రోజుల్లో దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ప్రధాన భాగం కేరళలో ఉండగా, గత 24 గంటల్లో 565 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 2,872గా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News