Tuesday, September 17, 2024

243 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  వన్డే ప్రపంచకప్ లో భాగంగా భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ 243 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికా పై భారీ విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి101 (121 బంతుల్లో 10 పోర్లు) శతకంతో అదరగొట్టాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 83 పరుగులకే అలౌటైంది. భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా జట్టు విలవిల లాడింది. రవీంద్ర జడేజా(5/33), షమీ(2/18), సిరాజ్(1-11), కుల్ దీప్ యాదవ్ (1/7) బౌలింగ్ లో అదరగొట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News