- Advertisement -
ఢిల్లీ: ఆంక్షల నేపథ్యంలో భారత్, పాక్ పౌరులు సొంత దేశాలకు వెళ్తున్నారు. అటారీ నుంచి స్వదేశానికి 120 మంది భారత పౌరులు వచ్చారు. 180 మంది పాక్ పౌరులు వాఘా నుంచి స్వదేశానికి వెళ్లారు. కేంద్రం నుంచి ఆదేశాల నేపథ్యంలో తెలంగాణలోని పాకిస్తానీలు వెంటనే భారత్ను వీడాలని డిజిపి జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27 తర్వాత వీసాలు రద్దవుతాయని, మెడికల్ వీసా దారులకు ఈ నెల 29 వరకు గడువు ఉంటుందని స్పష్టం చేశారు. అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్రం ఆదేశాలతో తెలంగాణ డిజిపి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
- Advertisement -