- Advertisement -
వర్జీనియా: అమెరికాలో జరిగిన కాల్పుల్లో భారత్కు చెందిన తండ్రి, కుమార్తె మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్జీనియాలోని ఓ డిపార్ట్మెంట్ స్టోర్లో పని చేస్తున్న ఊర్మి(24), ఆమె తండ్రి ప్రదీప్ పటేల్(56) దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందారు. గురువారం ఉదయం మద్యం కోసం వచ్చిన దుండగుడు ముందురోజు రాత్రి స్టోర్ ఎందుకు మూసివేశారని పడ్డాడు. ఈ క్రమంలో అతను కాల్పులు జరపగా.. ప్రదీప్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందాడు. దాడిలో గాయపడిన ఊర్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరణించింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -