66,240 మంది ఖాతాల్లో రూ.39.74
కోట్లు జమ కోడ్ లేని ఉమ్మడి రంగారెడ్డి,
మహబూబ్నగర్ జిల్లాలకే పరిమితం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉపా ధి కూలీలకు తీపి కబురు అందించింది. ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను విడుదల చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారె డ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీల కు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు జమ చే సింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26న ఇం దిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతి మండలంలోని ఒక పైలెట్ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి 18,180 మం ది కూలీల ఖాతాల్లో రూ.6వేలు చొప్పున జమ చేసిం ది. ఆ తర్వాత మండలి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇందిరమ్మ ఆత్మీయ భరో సా నిలిచిపోయింది. అయితే ఎన్నికల కోడ్ అమలు లో లేని జిల్లాలకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం బుధవా రం నిధులు విడుదల చేసింది. ఈ విషయాన్ని మంత్రి సీతక్క ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 66,240 మం ది ఉపాధి కూలీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు రూ.39.74 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు రూ.50.65 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎన్నికల కోడ్ ముగియగానే లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను చెల్లించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న ఉపాధి కూలీలకు ఈ మొత్తం పెద్దదిక్కుగా నిలుస్తుందని ఆ ప్రకటనలో తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఉపాధి కూలీలకు ఆర్దిక చేయుత కల్పిస్తూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒక సీజన్కు రూ.6 వేల చొప్పున కూలీలకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం డిబిటి పద్ధతిలో ఉపాధి కూలీల ఖాతాల్లోకి నేరుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసింది.