Sunday, February 23, 2025

లాల్‌దర్వాజ బోనాల జాతర.. అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: లాల్‌దర్వాజలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారిని ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలు దర్శించుకున్నారు. ఆషాడమాసం ఆఖరి ఆదివారం సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సంబరాలు ఈరోజు(ఆదివారం) ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి ఇంద్రకర్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఇక, బిజెపి నేత లక్ష్మణ్, హరియానా గవర్నర్ దత్తాత్రేయ అమ్మవారిని దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్న నేపథ్యంలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News