Tuesday, September 17, 2024

ఇంద్రాణీ ముఖర్జీ డాక్యుమెంటరీ విడుదలకు తాత్కాలిక బ్రేక్

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణీ ముఖర్జీపై రూపొందిన ఓ డాక్యుమెంటరీ విడుదలకు బాంబే హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఫిబ్రవరి 29 వరకు దీనిని విడుల చేయొద్దని నెట్‌ఫ్లిక్స్‌ను ఆదేశించింది అంతలోపు ఈ డాక్యుమెంటరీ ని సిబిఐ, కోర్టు కోసం ప్రత్యేకంగా ప్రదర్శించాలని సూచించింది. ‘ ది ఇంద్రాణీ ముఖర్జీ స్టోరీ : ది బర్రీడ్ ట్రూత్ పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందింది. ఫిబ్రవరి 23న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధమైంది.

అయితే, దర్యాప్తు పూర్తయ్యేవరకు ఓటీటీలో విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ బాంబే హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది. విచారించిన డివిజన్ బెంచ్ , దర్యాప్తు సంస్థతోపాటు న్యాయస్థానం వీక్షించేందుకు ముందస్తుగా ప్రదర్శించాలని సదరు ఓటీటీ సంస్థను ఆదేశించింది. దీనికి నెట్‌ఫ్లిక్స్ అంగీకరించింది. తదుపరి విచారణ ( ఫిబ్రవరి 29) వరకు విడుదల చేయబోమని న్యాయస్థానానికి తెలిపింది.

2012లో తన కుమార్తె షీనాబోరా హత్య కేసులో ఇంద్రాణీ ముఖర్జీ ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టై సుమారు ఆరున్నరేళ్లు జైల్లో ఉన్న ఇంద్రాణీ, 2022 మేలో బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ వ్యవహారంపై ఇటీవల ఓ డాక్యుమెంటరీ సిరీస్ రూపొందింది. అయితే దర్యాప్తు కొనసాగుతున్నందున , అది పూర్తయ్యేవరకు ఈ సిరీస్ విడుదల చేయొద్దని సీబీఐ వాదిస్తోంది. సీబీఐ ప్రకారం ఈ కేసులో మొత్తం 237 మంది సాక్షులకు గాను ఇప్పటివరకు 89 మందిని విచారించినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News