డిఫరెంట్ మూవీస్తో ప్రేక్షకులను మెప్పిస్తోన్న హీరో శ్రీవిష్ణు ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో అలరించబోతున్నారు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మిస్తున్నారు. రెబా జాన్ హీరోయిన్. సామజవరగమన తర్వాత శ్రీవిష్ణు, రెబా జాన్ కలయికలో రాబోతున్న చిత్రమిది. శుక్రవారం హీరో శ్రీవిష్ణు పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
టైటిల్ టీజర్ను గమనిస్తే వాయిస్ ఓవర్లో ‘గేమ్ ఓవర్ జయ్’ అని వినిపిస్తోంది. శ్రీవిష్ణు ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన ఫ్లాష్ కట్స్ను చూడొచ్చు. చాలా ఫాస్ట్గా చూపించిన ఈ గ్లింప్స్లో చిత్రంలోని నటీనటులతో పాటు శ్రీవిష్ణుని ఇన్వెస్టిగేటర్గా, ఖైదీగా చూడొచ్చు. చివరలో ‘నేను చెప్పే వరకు గేమ్ ఫినిష్ కాదు’ అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ వస్తుంది. ఈ టైటిల్ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తూ ‘మృత్యుంజయ్’ అని సినిమా టైటిల్ను తెలియజేశారు. ‘మృత్యుంజయ్’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
క్రేజీ రైడ్ కోసం రండి..
హీరో శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటించారు. కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్పై ప్రొడక్షన్ నంబర్ 3గా సుమంత్ నాయుడు.జి నిర్మిస్తారు. హేమ, షాలిని ఈ చిత్రాన్ని సమర్పిస్తారు, సుబ్రహ్మణ్యం నాయుడు.జి, రామాచారి.ఎం సహ నిర్మాతలు. అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమా స్టయిల్ అండ్ టోన్ని సెట్ చేసింది. హీరో హోండా సిడి100 బైక్ ఐదు టైర్లతో చూపించడం ఎక్స్ట్రార్డినరీగా వుంది. ‘క్రేజీ రైడ్ కోసం రండి – బ్రేక్లు లేవు, నవ్వులు మాత్రమే!’ అనే క్యాప్షన్ సినిమా ఎలా ఉంటుందో తెలియజేసింది. ఈ చిత్రం ఒంగో లు పట్టణం నేపథ్యంలో సాగుతుందని హోర్డింగ్లు చెబుతున్నాయి. ఈ క్రేజీ ఎంటర్టైనర్లో శ్రీ విష్ణు హిలేరియస్ క్యారెక్టర్లో కనిపిస్తారు.