Wednesday, October 16, 2024

నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపనకు మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

ఈనెల 15న వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని దామగుండంలో ఏర్పాటు కానున్న నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం అందింది. గురువారం పరిగి ఎంఎల్‌ఎ రామ్మోహన్ రె హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.

ఈ సందర్బంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటుతో భారత రక్షణ వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని అన్నారు. పరిగి నియోజకవర్గ ప్రజలకు ఈ స్టేషన్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు, దేశంలోనే రెండో రాడార్ స్టేషన్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు లభించనుందని మంత్రి తెలిపారు. రాడార్ స్టేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ బీర్ సింగ్, పలువురు నేవీ అధికారులు ఈ సందర్భంగా మంత్రిని కలిసారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News