Sunday, September 8, 2024

IPL 2024: మెరుపు ఇన్నింగ్స్ తో ఆదుకున్న నితీస్ రెడ్డి.. పంజాబ్ కు భారీ టార్గెట్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 17వ సీజ‌న్ లో పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో స‌న్‌రైజ‌ర్స్ బ్యాట్స్ మెన్స్ తడబడి నిలిచారు. దీంతో పంజాబ్ కు 183 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది హైదరాబాద్ జట్టు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్.. నితీష్ రెడ్డి(64), అబ్దుల్ సమద్(25), ట్రావిస్ హెడ్(21), షాబాద్(14 నాటౌట్)లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది.

ఓ దశలో 150 పరుగుల లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించినా సన్ రైజర్స్ ను నితీష్ రెడ్డి ఆదుకున్నాడు. తొలుత నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన నితీష్.. తర్వాత వరుస బౌండరీలతో అలరించారు. భారీ సిక్సులతో మెరుపులు మెరిపించాడు. ఇక, పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. హర్షల్ పటేల్, శామ్ కరన్ లు చెరో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News