యంగ్ డైనమైట్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. ఐపిఎల్ చరిత్రలో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున శతకం సాధించిన తొలి భారత ఆటగాడిగా నయా రికార్డును నమోదు చేశాడు. సన్రైజర్స్ తరఫున బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే ఇషాన్(106) సెంచరీ సాధించడం విశేషం. ఐపిఎల్లో ఇషాన్కు ఇదే తొలి సెంచరీ. విధ్వంసకర బ్యాటింగ్తో రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడిన ఇషాన్ కిషన్.. 11 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీపూర్తిచేసుకున్న అతను.. మరో 20 బంతుల్లోనేసెంచరీమార్క్ అందుకున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఇప్పటివరకు విదేశీ ఆటగాళ్లు మాత్రమే శతకాలు సాధించారు. ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, జానీ బెయిర్ స్టో, హ్యారీ బ్రూక్లు శతకాలు నమోదు చేశారు. తాజాగా ఈ జాబితాలో ఇషాన్ కిషన్ చేరాడు. రూ.11.25 కోట్లతో.. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో ఇషాన్ కిషన్ను సన్రైజర్స్ హైదరాబాద్ రూ.11.25 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది.
భారత తొలి బ్యాటర్గా ఇషాన్ రికార్డు
- Advertisement -
- Advertisement -
- Advertisement -