Tuesday, September 17, 2024

గాజాలో ఇజ్రాయెల్ దాడులకు 142 మంది మృతి

- Advertisement -
- Advertisement -

గాజాలో ఇజ్రాయెల్ దాడులకు గత 48 గంటల్లో 142 మంది మృతి చెందారని పాలస్తీనియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 150 మంది గాయపడ్డారు. దీంతో గాజాలో పాలస్తీనియన్ల మృతుల సంఖ్య మొత్తం 39.897కు పెరిగిందని , మొత్తం 92,000 గాయపడ్డారని సోమవారం ప్రకటించారు. ఇజ్రాయెల్‌పై ఆకస్మికంగా గత అక్టోబర్ 7న హమాస్ దాడికి పాల్పడినప్పుడు పాలస్తీనియా మిలిటెంట్లు 1200 మందిని మట్టుబెట్టారు. మృతుల్లో చాలా మంది పౌరులు ఉన్నారు. దాదాపు 250 మందిని బందీ చేశారు. వీరిలో చాలామందిని గత నవంబర్‌లో యుద్ధం ఆగినసమయంలో విడుదల చేయగా, ఇంకా 110 మంది గాజాలో బందీలుగా ఉన్నారు. వీరిలో మూడో వంతు మంది చనిపోయి ఉంటారని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News