Tuesday, September 17, 2024

విపత్తుల నిర్వహణలో మరో ముందడుగు

- Advertisement -
- Advertisement -

వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం మరొక ఘనత సాధించింది. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వి డి3ని ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ రాకెట్ ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం (ఇఒఎస్-08)ని ఇస్రో నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. విపత్తుల సమయంలో ఈ ఉపగ్రహం కీలక సమాచారం పంపిస్తుంది. ప్రకృతి విపత్తులతో పాటు అగ్ని పర్వతాలను కూడా ఈ శాటిలైట్ పర్యవేక్షిస్తుంది. మొత్తం 17 నిమిషాల పాటు రాకెట్ ప్రయోగం సాగింది. ఈ ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ శ్రీహరికోటలోని మిషన్ కంట్రోల్ సెంటర్‌లో సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ‘ఇఒఎస్-08తో ఈ మూడవ అభివృద్ధి ఫ్లైట్ ఎల్‌వి డి3 లక్షాన్ని సాధించింది. ముందు నిర్ణయించిన ప్రకారమే నిర్దేశిత కక్షలో ఎస్‌ఎస్‌ఎల్‌విని రాకెట్ ప్రవేశపెట్టింది.

ఈ క్రమంలో ఎటువంటి మళ్లింపులూ లేవు’ అని చెప్పారు. ఉపగ్రహం ప్రయోగ కొలమానాలు ప్రతిదీ పక్కాగా ఉందని సూచిస్తున్నాయని, భూ పరిశీలన ఉపగ్రహం, ప్యాసింజర్ ఉపగ్రహం ఎస్‌ఆర్-ఒ డెమోశాట్ నిర్దేశిత విన్యాసాల అనంతరం కక్షలోకి ప్రవేశపెట్టడమైందని ఆయన తెలియజేశారు. ‘ఎల్‌వి డి3 ప్రాజెక్ట్ బృందానికి అభినందనలు. దీనితో ఈ మూడవ అభివృద్ధి ఫ్లైట్ ఎల్‌వి పూర్తి అయింది’ అని సోమనాథ్ చెప్పారు. ‘పరిశ్రమలకు ఎల్‌వి టెక్నాలజీల బదలీ ప్రక్రియలో ఉన్నా. అందువల్ల ఇది ఎల్‌వికి, ప్రయోగ నౌకకు శుభారంభం’ అని ఆయన పేర్కొన్నారు. ‘ఇది 100 శాతం జయప్రదం. ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టడమైంది’ అని సోమనాథ్ ఆ తరువాత విలేకరులతో చెప్పారు. ఇఒఎస్‌ను యుఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో అభివృద్ధి చేశారు. ఈ ఉపగ్రహంలో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్ పేలోడ్ మిడ్ వేవ్, లాంగ్ వేవ్ ఇన్‌ఫ్రారెడ్‌లో చిత్రాలు తీస్తుంది. ఈ శాటిలైట్ పంపించే సమాచారం విపత్తు నిర్వహణలో ఎంతో ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఉపగ్రహం ఏడాది పాటు పని చేస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News