Thursday, September 19, 2024

జగిత్యాలలో బైక్ ను బస్సు ఢీకొట్టి… 150 మీటర్లు లాక్కెళ్లింది

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జగిత్యాల జిల్లాలోని పొలాస బస్టాండ్ వద్ద తాత తన మనవడు, మనవరాలిని బైక్‌పై తీసుకెళ్తుండగా వారిని ప్రైవేటు బస్సు ఢీకొట్టి 150 మీటర్లు లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో తాత, మనవరాలు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా తీవ్రంగా గాయపడిన మనవడిని ఆస్పత్రికి తరలించారు. మనవడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన బైండ్ల లచ్చన్న తన కూతురు ధర్మపుర గ్రామంలో నివసిస్తోంది. సోమవారం సెలవు కావడంతో మనవరాలు నారవేసి శ్రీనిధి(9), మనవడు మల్లిఖార్జున్(08) బైక్ తీసుకొని తన గ్రామానికి బయలుదేరారు. జగిత్యాల జిల్లా కేంద్రం శివారులోకి రాగానే ప్రైవటే బస్సు అదుపు తప్పి బైక్ ను ఢీకొట్టింది. అనంతరం బైక్‌ను 150 మీటర్లు లాక్కెళ్లింది. తాత, మనవరాలు అక్కడికక్కడే చనిపోగా మనవడి పరిస్థితి విషమంగా ఉంది. శరీర భాగాలు నుజ్జునుజ్జుగా మారాయి. మరో బైక్‌ను కూడా ఢీకొట్టడంతో వారు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News