Saturday, October 5, 2024

రెండు రోజులు పాకిస్థాన్ వెళ్లనున్న జైశంకర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి ఎస్ .జైశంకర్ అక్టోబర్ 15, 16 తేదీల్లో పాకిస్థాన్ లో పర్యటించనున్నారు. ఆయన అక్కడ షాంఘై సహకార సంస్థ(షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్) మండలి సమావేశంలో హాజరుకానున్నారు. కశ్మీర్ కారణంగా, సరిహద్దు ఉగ్రవాదం కారణంగా భారత, పాకిస్థాన్ ల మధ్య సంబంధాలు బెడిసిన నేపథ్యంలో ఆయన ఈ పర్యటన చేస్తున్నారు. పాకిస్థాన్ కు ఇదివరలో సందర్శించిన భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్.  ఆమె 2015లో ఆఫ్ఘానిస్థాన్ అంశంపై జరిగిన సమావేశంలో పాల్గొనేందుకు నాడు పాకిస్థాన్ పర్యటించారు. సాధారణంగా షాంఘై సహకార సంస్థ మండలి సమావేశానికి ప్రభుత్వాధినేతలు హాజరవుతారు.పాకిస్థాన్ ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News