Thursday, September 19, 2024

స్నేహితులతో ఛాలెంజ్… కర్నూల్‌లో కాలువలో గల్లంతైన జవాన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: స్నేహితులతో పందె కాసి కాలువలో దూకిన ఆర్మీ జవాన్ గల్లంతైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కెసి కాలువలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వరద ఎక్కువగా ఉన్న కాలువలో ఈత కొడుతానని పవన్(24) అనే జవాన్ స్నేహితులతో ఛాలెంజ్ చేశాడు. కాలువలో దూకగానే వరద ఉద్ధృతికి కొట్టుకొనిపోయాడు. వెంటనే స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పవన్ జమ్మూలో జవాన్‌గా సేవలందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News