Sunday, September 8, 2024

మేడారం వెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడారం జాతరకు వెళ్లిన వారి ఇళ్లను దొంగలు టార్గెట్ చేసుకున్నారు. అల్వాల్ పరిధిలోని కృష్ణానగర్‌లో తాళాలు వేసిన ఇళ్లల్లో దొంగలు వరుసగా చోరీలు చేస్తున్నారు. మచ్చబొల్లారం కృష్ణానగర్‌లోని బాలయ్య గత నెల 30వ తేదీన ఇంటికి తాళం వేసి మేడారం జాతరకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి 30తులాల బంగారు ఆభరణాలు, రూ.3లక్షల నగదు చోరీకి గురైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా దొంగతనాలు జరుగుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Jewelry stolen from Locked Homes in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News