Sunday, October 6, 2024

నేడు హుస్నాబాద్ లో జాబ్ మేళా: పొన్నం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: హుస్నాబాద్ నియోజకవర్గంలో తొలిసారి ఈ రోజు జాబ్ మేళా నిర్వహించబడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఫస్ట్ క్లాస్ నుండి పిజి వరకు చదివిన వారికి ఉద్యోగాలు పొందే  విధంగా ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. విదేశాల్లో కూడా చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, వారికి వివిధ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ రోజు జరిగే జాబ్ మేళాలో నియోజకవర్గ నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని పొన్నం సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News