Wednesday, March 12, 2025

విలువలతో కూడిన జర్నలిజం అవసరం

- Advertisement -
- Advertisement -

ఐజేయు మాజీ అధ్యక్షుడు, మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్
మన తెలంగాణ/హైదరాబాద్ : విలువలతో కూడిన జర్నలిజం అవసరం ఉన్నదని ఐజెయు మాజీ అధ్యక్షుడు, మన తెలంగాణ ఎడిటర్ దేవుల పల్లి అమర్ అన్నారు. జర్నలిస్టుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన దుయ్యబట్టా రు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ద్వితీయ మహాసభ ప్రగతి రిసార్ట్ లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ఐజెయు మాజీ జాతీయ అధ్యక్షుడు, మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కిం గ్ జర్నలిస్ట్ అధ్యక్షుడు విరాహత్ అలీ, భారత రాష్ట్ర సమితి జాతీయ స్పోక్స్ పర్సన్ కార్తీక్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా దేవులపల్లి అమర్ మాట్లాడుతూ దేశంలోనే అధిక ఆదాయాన్ని దేశానికి ఇస్తున్న జిల్లాగా రంగారెడ్డి ప్రథమ స్థానంలో నిలుస్తుందన్నారు. స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జర్నలిస్టుల సమస్యలపై దశాబ్దాల కాలంగా యూనియన్ చేస్తున్న కృషిని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అగ్ర జర్నలిస్టులు తమ యూనియన్ వారే అన్నారు. నాడు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తే ఆంధ్రప్రదేశ్‌లో సంఘం నుండి వ్యతిరేకత వచ్చినా ముందుకెళ్లినట్లు పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వాల్లో మన యూనియన్ నుండి ప్రాతినిధ్యం వహించిన పాత్రికేయుల సంక్షేమాన్ని ఎన్నడూ విస్మరించలేదన్నారు. జాతీయ కార్యదర్శి నరేందర్‌రెడ్డి మాట్లాడు తూ ఇటీవలి కాలంలో జర్నలిజంలో చోటు చేసుకున్న సంఘటనలు బాధాకరమన్నారు. జర్నలిస్టులు ప్రజల గొంతుకలుగా పనిచేయాలన్నారు. గత ప్రభుత్వం తమ సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించిందన్నారు.

తెలంగాణ రాష్ట్ర స్టేట్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు విరాహత్ అలీ మాట్లాడుతూ పుట్టగొడుగుల్ల అనేకమంది జర్నలిస్టులమని చెప్పుకొని తిరుగుతూ వ్యవస్థ ను పలుచన పడేస్తున్నా రన్నారు, ఇట్లాంటి వాటిపై జర్నలిస్టులు దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉన్నదని ఆయన పిలుపు నిచ్చారు, భారత రాష్ట్ర సమితి స్పోక్స్ పర్సన్ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు అండగా నిలబడతామని ఆయన హామీ ఇచ్చారు, రాబోయే రోజుల్లో అధికారంలోకి రాగానే జర్నలిస్టుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టితో ఆలోచన చేసేందుకు బాధ్యత తీసుకొని మీకు అండగా నిలబడతానని ఆయన జర్నలిస్టులకు భరోసా కల్పించారు.

జిల్లాలోని జర్నలిస్టులకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా రక్షణకు అవసర పడిన ప్రీమియమును అందజేసిన భారత రాష్ట్ర సమితి జాతీయ స్పోక్స్ పర్సన్ కార్తీక్ రెడ్డికి జిల్లా కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ, కార్యదర్శులు శ్రీకాంత్ రెడ్డి,మధు గౌడ్,కోశాధికారి వెంకట్ రెడ్డి,రాష్ట్ర ముఫిసిల్ కమిటీ చైర్మన్ పేపర్ శ్రీనివాస్,మేడ్చల్ జిల్లా అధ్యక్షులు,ఎన్నికల అధికారి బాలరాజు గౌడ్,జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షులుగా ఎం డి సలీమ్ పాషా,కార్యదర్శిగా సత్యనారాయణలు ఎన్నికయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News