Monday, April 28, 2025

వృద్ధ దంపతుల కోసం.. కోర్టు బయటకు వచ్చి న్యాయమూర్తి విచారణ

- Advertisement -
- Advertisement -

ఓ కేసు నిమిత్తం కోర్టుకు వచ్చిన వృద్ధ దంపతులను చూసి చలించిపోయిన న్యాయమూర్తి కోర్టు హాలు నుంచి బయటకు వచ్చి విచారించారు. ఈ అరుదైన ఘటన నిజామాబాద్ జిల్లా, బోధన్‌లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అదనపు కట్నం కేసు విషయంలో కోడలు, అత్త, మామపై కేసు పెట్టింది. ఈ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చిన వృద్ధ్ద దంపతులు నడవలేని స్థితిలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న జెఎఫ్‌సిఎం న్యాయమూర్తి సాయి శివ కోర్టు బయటకు వచ్చి ఆటోలో ఉన్న వృద్ధ్ద దంపతుల నుంచి వివరాలను సేకరించారు. కాగా, నడవలేని స్థితిలో ఉన్న వృద్ధ్ద దంపతుల వద్దకు కోర్టు హాలును విడిచి న్యాయమూర్తే స్వయంగా వచ్చి విచారణ చేపట్టడం ఆయనలోని మానవతా దృక్పథాన్ని చాటుకుంది. ఈ సంఘటనను చూసిన పలువురు న్యాయమూర్తిని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News