Wednesday, July 3, 2024

త్వరలో కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బిఆర్ఎస్ ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై  హైకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో కవిత మూడు నెలలుగా జైలులో ఉంటున్నారు. ఆమె తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెయిల్ పిటిషన్‌పై తీర్పు ఇవ్వనున్నారు.

సిబిఐ అవినీతి కేసుతో పాటు ఈడి మనీలాండరింగ్‌ కేసులో కవిత బెయిల్ దరఖాస్తులను కొట్టివేస్తూ మే 6న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆమె సవాల్ చేశారు. ఈ కేసులోని 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, దీనిని పరిగణనలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. కాగా ఈ వాదనను సిబిఐ, ఈడి వ్యతిరేకించాయి. ఇకపోతే  నేడు సాయంత్రం ఈ విచారణ తాలూకు తీర్పు రానుంది.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News