Sunday, April 13, 2025

జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఉపలోకాయుక్తగా జస్టిస్ బిఎస్
జగ్జీవన్‌కుమార్ మానవహక్కుల
కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ షమీమ్
అక్తర్ సభ్యులుగా శివాడి ప్రవీణ్
బి. కిషోర్ నియామక ఉత్తర్వులు
జారీ జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి,
జస్టిస్ షమీమ్ అక్తర్‌లది
ఉమ్మడి నల్లగొండ జిల్లా

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంతో కాలంగా ఖాళీగా ఉన్న తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, లోకాయుక్త, ఉప లోకాయుక్త పోస్టు లను ప్రభుత్వం భర్తీ చేసింది. తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జ స్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డి, ఉప లోకాయుక్తగా జస్టిస్ బిఎస్ జగ్జీవన్ కుమార్, రాష్ట్ర మావన హక్కుల కమిషన్ చైర్‌పర్సన్‌గా జస్టిస్ షమీమ్ అక్తర్, మానవ హక్కుల కమిషన్ సభ్యులుగా శివాడి ప్రవీణ్, బి.కిషోర్‌ను నియమించింది. జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి లోకాయుక్తగా ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు.మానవ హక్కులచైర్‌పర్సన్‌గా జస్టిస్ షమీమ్ అక్తర్ మూడేళ్ల పాటు కొన సాగనున్నారు. ఈ మేరకు శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. కా గా వీరి నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలకు గత శనివారమే గవర్నర్ ఆమోదం  తెలిపారు. తెలంగాణ లోకాయుక్త రాజశేఖర్ రెడ్డి, హెచ్‌ఆర్‌సి చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ నల్గొండ జిల్లా వాసులు కావడం గమనార్హం. సచివాలయంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, లోకాయుక్త, ఉపలోకాయుక్త పోస్టుల భర్తీకి ఈ నెల 5వ తేదీన సచివాలయంలో సిఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన సెలక్షన్ కమిటీ అభ్యర్థుల జాబితాను వడపోసి వీరి పేర్లను ఖరారు చేసింది.

జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ షమీమ్ అక్తర్ ప్రస్థానం
నల్గొండ జిల్లా పెద్దవూర మండలం సిర్సనగండ్ల గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో 1960, మే 4న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జయప్రద, రామానుజరెడ్డి. హైదరాబాద్‌లోని ఎవి కాలేజీ నుంచి పట్టభద్రులైన ఆయన కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బంగారు పతకం పొందారు. 1985, ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ అయ్యారు. తొలుత మహమూద్ అలీ వద్ద ప్రాక్టీస్ చేశారు. నాలుగేళ్ల తర్వాత స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2004లో హైకోర్టు న్యాయవాదుల సంఘం(హెచ్‌సిఎఎ) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2004లో కేంద్ర ప్రభుత్వానికి సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా కూడా పనిచేశారు. 2013, ఏప్రిల్ 12న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2014లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

2022 ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు.
షమీమ్ అక్తర్ : 1961, జనవరి 1న నల్లగొండలో రహీమున్నీసా బేగం, జాన్ మహమ్మద్‌కు జన్మించారు. నల్లగొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బికామ్ చదివారు. నాగ్‌పూర్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా నుంచి న్యాయపట్టా పొందారు. 1996 లో హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని పిజి కాలేజ్ ఆఫ్ లా నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 2006లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. 2002లో నల్లగొండ జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత పలు కోర్టుల్లో పనిచేసిన ఆయన ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ ట్రిబ్యునల్ ప్రిసెడింగ్ ఆఫీసర్‌గా, ఆంధ్రప్రదేశ్ జ్యూడిషియల్ అకాడమీ అదనపు డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. హైకోర్టులో రిజిస్ట్రార్ (జ్యుడిషియల్)గా పనిచేశారు. 2017లో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2022 డిసెంబర్‌లో పదవీ విరమణ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News