Wednesday, July 3, 2024

‘కల్కి’ త్రీ వరల్డ్ మధ్య నడిచే కథ

- Advertisement -
- Advertisement -

మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 ఎడి’ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో గ్లోబల్ వైడ్‌గా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘భైరవ ఆంథమ్’ ఇండియన్స్ బిగ్గెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా టాప్ చార్ట్‌లో వుంది. ఎపిక్ జర్నీ ఎపిసోడ్ 1 – ది ప్రిల్యూడ్ ఆఫ్ కల్కి 2898ఎడి మరింత ఆసక్తిని పెంచింది. గురువారం మేకర్స్ వరల్డ్ ఆఫ్ కల్కి 2898 ఎడి- ఎపిసోడ్ 2ని రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ 2లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ “కాశీ భూమి మీద మొదటి నగరం. అలాంటిది ఈ ప్రపంచంలో కాశీనే ఆఖరి సిటీ అయితే ఎలా ఉంటుందన్న ఐడియాతో కల్కి స్క్రిప్ట్ ప్రారంభించాము.

కలియుగం ఎండింగ్‌లో అంతా అయిపోయిన తర్వాత గంగ ఎండిపోయిన తర్వాత లాస్ట్ సిటీ ఏముంటుందని అనుకుంటే… అలాంటి సమయంలో మన కాశీ ఉంటే ఎలా వుంటుంది, నాగరికత పుట్టిందే కాశీలో… అలాంటి ఆ సిటీని క్రియేట్ చేయడం చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఇండియన్ ఆర్కిటెక్చర్, వెహికిల్స్, కరెన్సీ ఇలా అన్ని ఫ్యూచరిస్టిక్ గా కాశీని బిల్డ్ చేయడం మొదలుపెట్టాం. కాశీపైన పిరమిడ్ ఆకారంలో ఉండే స్ట్రక్చర్ వుంటుంది, దాన్ని మేము కాంప్లెక్స్ అంటాం. భూమిపై లేని నేచర్, యానిమల్స్, ఫుడ్… ఇలా ప్రతిదీ ఇక్కడ ఉంటుంది. ఒకరమైన స్వర్గం అనుకోవచ్చు. కల్కి కథలో మూడో వరల్డ్ కూడా వుంది. అదే శంబాల. ఇది కల్కి స్టొరీకి ఇంటిగ్రల్‌గా వుంటుంది. కాశీకి కాంప్లెక్స్‌కి సంబంధం లేని థర్డ్ వరల్డ్. ఈ వరల్డ్‌లో వున్న వారు కాంప్లెక్స్ లో వున్నవారిని ఛాలెంజ్ చేస్తుంటారు. ఈ వరల్డ్‌లో గాడ్ అనే ఐడియా వుండదు. గాడ్‌ని బ్యాన్ చేసిన వరల్డ్. ఈ మూడు వరల్డ్‌ల మధ్య మన కథ నడుస్తుంది.

ఒక్కొక్క వరల్డ్‌ని ఒకొక్క థాట్ ప్రాసెస్ తో డిజైన్ చేశాం. కాశీలో ప్రజలు, వెహికిల్స్, కరెన్సీ, ఫుడ్, వెపన్స్ ఒకలా వుంటాయి. కాంప్లెక్స్‌లో ఒకలా వుంటాయి. శంబాలా పూర్తిగా డిఫరెంట్. ఒక్కొక్కరిది ఒక్కో కల్చర్. శంబాలాలో దేవుడు మళ్ళీ పుడతాడనే ఒక నమ్మకం ఉంది. కల్కి అవతారం శంబాలాలో పుడుతుందనే నమ్మకం మన పాపులర్ కల్చర్‌లో వుంది. ఈ మూడు వరల్డ్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతూ ‘కల్కి’ కథ నడుస్తుంది”అని అన్నారు. ’కల్కి 2898 ఎడి’ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ -ఇన్‌స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News