Friday, October 18, 2024

క‌ల్యాణ్‌రామ్ కొత్త చిత్రం ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నందమూరి యంగ్ హీరో క‌ల్యాణ్‌రామ్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. క‌ల్యాణ్‌రామ్ 19వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమాకు సంబంధించిన పూజా క్యార్యక్రమం హైద‌రాబాద్‌లో జరిగింది. ఈ మూవీకి కొత్త దర్శకుడు రాజేంద్ర ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. మార్చి రెండో వారం నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. త్వరలో ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను చిత్రయూనిట్ వెల్లడించనుంది. కాగా, మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఉప్పెన మూవీ గత శుక్రవారం విడుదలై రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది.

Kalyan Ram’s New Film Launch in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News