Tuesday, September 17, 2024

‘కమిటీ కుర్రోళ్ళు’ అలాంటి సినిమానే: నిహారిక

- Advertisement -
- Advertisement -

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కు ర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 9న విడుదలైన ఈ చిత్రం అ న్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ఈనెల 12 నుంచి ఈటీవి విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ’కమిటీ కుర్రోళ్ళు’ టీం ప్రీ స్ట్రీ మింగ్ సెలబ్రేషన్స్‌ని గ్రాండ్‌గా నిర్వహించింది.

ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్‌లో ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. “ఈటీవిలో వచ్చే కంటెంట్ మీ మా మన అనుకునేలా వుంటుంది. ’కమిటీ కుర్రోళ్ళు’ అలాంటి సినిమానే. మీ సినిమాలా అ నుకొని తీశాం”అని అన్నారు. డైరెక్టర్ యదు వం శీ మాట్లాడుతూ “ఇది పక్కా తెలుగు సినిమా. ఇ లాంటి సినిమా ఈటీవీ విన్‌లో వుండాలి” అని తె లిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొ డ్యూసర్ మన్యం రమేష్, ఈటీవీ విన్ బిజినెస్ హె డ్ సాయికృష్ణ, ఈ సినిమాయాక్టర్స్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News