Sunday, July 7, 2024

రింగ్ రోడ్డు కాదు… దొంగ రోడ్డు: కంచర్ల భూపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:  అది రింగ్ రోడ్డు కాదు దొంగ రోడ్డు అని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ అనుచరులకు దోచి పెట్టడానికి.. ఆడుతున్న నాటకమని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మండిపడ్డారు. కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ రింగ్ రోడ్ బాధిత కుటుంబాలు, పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కంచర్ల మీడియాతో మాట్లాడారు. 3000 కుటుంబాలు కష్టపడి చెమటోడ్చాయని, సంపాదించుకున్న ప్లాట్లు, ఇండ్లు, నష్ట పోతున్నా పట్టించుకోవడంలేదని, అధికారం ఉందనే అహంకారంతో కోమటిరెడ్డి మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ప్లాన్ 1, 2ను వదిలేసి తమ అనుచరుల లబ్ధికోసం ప్లాన్ 3 ఎంచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్లాన్ 3 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే బాధితుల తరుపున తాము పోరాటం చేస్తామని, 15 రోజులలోగా ప్లాన్ 3 ఉత్తర్వులను ఉపసంహరించుకోకుంటే బాధితులతో కలిసి పాదయాత్ర చేస్తానని కంచర్ల హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News