Wednesday, September 18, 2024

ఉగ్రరూపంలో నాథనాధుడిగా శరత్ కుమార్..

- Advertisement -
- Advertisement -

డైనమిక్ హీరో విష్ణు మంచు ‘కన్నప్ప’ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్‌తో కన్నప్ప మీద మరింత బజ్ ఏర్పడింది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గురించి అందరూ మాట్లాడుకున్నారు. కన్నప్ప ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యే కన్నప్ప వాడిన విల్లు విశేషాలు నెట్టింట్లో ట్రెండ్ అయ్యాయి. తాజాగా కన్నప్ప చిత్రం నుంచి శరత్ కుమార్ పాత్రకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. శరత్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ఆయన కారెక్టర్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ చిత్రంలో ఆయన నాథనాధుడిగా కనిపించబోతున్నారు. రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆయన ఉగ్రరూపాన్ని మనం చూడొచ్చు. ఓ యోధుడిలా శరత్ కుమార్ కనిపిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఈ చిత్రాన్ని పద్మశ్రీ డా.మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సీ సంగీతాన్ని అందిస్తున్నారు. విజువల్ ట్రీట్ ఇచ్చేలా, ఇండియన్ స్క్రీన్ మీద మునుపెన్నడూ చూడనటువంటి గ్రాండియర్‌తో కన్నప్ప చిత్రం రానుంది. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారగణంతో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

పవర్ ఫుల్ రోల్‌లో శరత్ కుమార్..

హీరో సిద్ధార్థ్ తన 40వ సినిమా కోసం బ్లాక్ బస్టర్ టీంతో చేతులు కలిపారు. ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌కు ‘8 తొట్టక్కల్’ ఫేం శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ ‘మావీరన్’ నిర్మాత అరుణ్ విశ్వ, శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళ్‌లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఓ సర్‌ప్రైజింగ్ ప్రకటన వచ్చింది. ఈ చిత్రంలో స్టార్ట్ యాక్టర్ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారురు. ఈ ఇద్దరి స్టార్స్‌ని కలిసి తెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సిద్దార్థ్40’ కోసం శ్రీ గణేష్ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. హై బడ్జెట్, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ సినిమా రూపొందబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News