Tuesday, September 17, 2024

‘కాంత’ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిలిమ్స్ కొలాబరేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ మల్టీ లింగ్వల్ ప్రాజెక్ట్ కాంత హైదరాబాద్‌లోని రామా నాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. విక్టరీ వెంకటేష్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌కు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కూడా ప్రారంభమైంది. 1950 మద్రాస్ బ్యాక్‌డ్రాప్‌లో మానవ సంబంధాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది.

ఈ సందర్భంగా రానా దగ్గుబాటి మాట్లాడుతూ “కాంత కోసం వేఫేరర్ ఫిలిమ్స్‌తో భాగస్వామ్యం కావడం ఈ ప్రాజెక్ట్‌కి కొత్త డైమెన్షన్ ని యాడ్ చేసింది. క్యాలిటీ సినిమా పట్ల మా విజన్ ఒకేలా వుంటుంది. సురేశ్ ప్రొడక్షన్స్ 60వ యానివర్సరీని పురస్కరించుకుని, స్పిరిట్ మీడియాతో కొత్త శకానికి నాంది పలికేందుకు పర్ఫెక్ట్ మూవీ కాంత”అని అన్నారు. హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. “స్పిరిట్ మీడియాతో ‘కాంత’తో ఈ జర్నీ ప్రారంభించడం పట్ల ఉత్సాహంగా ఉన్నాను. ఇది మానవ భావోద్వేగాల లోతులను ఆవిష్కరించే అందమైన లేయర్డ్ కథ”అని తెలిపారు. డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ మాట్లాడుతూ “ఇటువంటి ప్రతిభావంతులైన నిర్మాతలు, క్రియేటివ్ టీంతో కలిసి పనిచేయడం ఆనందంగా వుంది. కాంతతో మేము ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని లక్ష్యంగా పని చేస్తున్నాం”అని పేర్కొన్నారు. ఈ చిత్రం తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషలలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News