Friday, September 20, 2024

బెంగళూరులోని ఓ ప్రదేశాన్ని పాకిస్థాన్ తో పోల్చిన న్యాయమూర్తి?

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఓ ఇంటి ఓనరు, కిరాయిదారు కేసు విచారణ సందర్భంగా కర్నాటక హైకోర్టు జడ్జీ వి. శృశానంద అనుచిత వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో ముస్లింలు ఎక్కువగా నివసిస్తున్న ఓ ప్రదేశాన్ని ‘పాకిస్థాన్’ తో పోల్చారు. ఆగస్టు 28న కేసు విచారణ సందర్భంగా ఆయన ‘‘మైసూరు రోడ్డు ఫ్లయ్ ఓవర్ వైపు వెళుతుండే…ప్రతి ఆటో రిక్షా డ్రైవర్ 10 మందిని ఎక్కించుకుని నడుపుతుంటాడు. గౌరిపాలయ మార్కెట్ నుంచి మైసూరు రోడ్డు ఫ్లయ్ఓవర్ వరకు ఉన్న ప్రదేశం ‘ఇండియాలో కాక పాకిస్థాన్’ లో ఉన్నట్లు ఉంటుంది. ఇది వాస్తవం. మీరు ఎవరైనా స్ట్రిక్ట్ ఆఫీసర్ ని అక్కడి పంపితే అతడిని పట్టుకు తంతారు. దీనిని ఏ ఛానల్ వాళ్లు చూయించరు’’ అన్నారు. ఆయన అన్న విషయాలున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  ఆయన రెంట్ కంట్రోల్ యాక్ట్ అంశాలు, డ్రైవర్ ల ఇన్సూరెన్స్ కవరేజ్ విషయాల మీద కూడా చర్చించారు. వాహనాలు నడిపే వేగంపై, స్కూటర్ పై వెళ్లే వారి సంఖ్యపై కూడా ఆయన తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పోలీసుల చేతకానితనాన్ని కూడా ఎత్తి చూపారు. ఆయన అభిప్రాయాలను తప్పుడు కోణంలో కాక, అంశాలను అర్థం చేసుకునే దృష్టితో చూడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News