Sunday, July 7, 2024

ఆ ఎంఎల్‌సి నాపై అత్యాచారం చేశాడు… పిఎస్‌లో యువకుడి ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తనపై ఓ ఎంఎల్‌సి అత్యాచారం చేశాడని ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం హాసన జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జనతాదళ్ కార్యకర్త(25) అరకలగూడలో నివసిస్తున్నారు. ఓ ఎంఎల్‌సి తనను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ఉద్యోగం ఇప్పిస్తానని పలుమార్లు చెప్పారు. ఒక రోజు సదరు ఎంఎల్‌సి తనను బెదిరించి అత్యాచారం చేశాడని జనతాదళ్ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 15 పేజీల లేఖను అతడు పోలీసులకు అందజేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అతడి ఒంటిపై గాయాలు ఉన్నట్టు గుర్తించామని, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. జనతాదళ్ కార్యకర్త తనకు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, తాను ఇవ్వకపోవడంతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని హొళెనరసిపుర పోలీస్ స్టేషన్‌లో ఎంఎసి అనుచరుడు ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణ, మాజీ మంత్రి హెచ్ డి రేవణ్ణ, ఆయన సతీమణి భవానీ కేసుల విషయ హాసనలో కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News