Friday, April 11, 2025

కవిత ఈడి విచారణలో లంచ్ బ్రేక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తెలంగాణ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితను ఈడి ఉదయం 11 గంటల నుంచి విచారిస్తోంది. ఐదుగురు అధికారులతో కూడిన ఈడి బృందం ఆమెను అనేక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. కాసేపటి కిందటే ఆమెకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఈడి కార్యాలయం ఆవరణలో ఫుడ్ ప్యాకెట్, వాటర్ బాటిల్ చేత్తో పట్టుకుని కవిత నడుస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఇప్పటికే కవితకు మనోధైర్యం కల్పించేందుకు అనేక మంది బిఆర్‌ఎస్ మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు కూడా వీరికి మద్దతు ఇవ్వొచ్చని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News