రాష్ట్ర మహిళలకు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కెసిఆర్ స్త్రీ శక్తిని కొనియాడారు. కుటుంబ వ్యవస్థను ముందుకు నడపడంలో మహిళల త్యాగం మహోన్నతమైనదని అన్నారు. దేశ సంపదను సృష్టించడంలో పౌరులుగా వారి పాత్ర గొప్పదని పేర్కొన్నారు. ఎన్నో కష్టాలను అధిగమిస్తూ పురుషుడితో సమానంగా నేటి సమాజంలో స్త్రీ పోషిస్తున్న పాత్ర అమోఘమని తెలిపారు. అవకాశాలు ఇస్తే అబల సబలగా నిరూపించుకుంటుందని వ్యాఖ్యానించారు. పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో రాష్ట్ర మహిళాభ్యున్నతి కోసం అమలు చేసిన పలు కార్యక్రమాలు వారి సాధికారతకు దోహదం చేయాశయని గుర్తు చేశారు.
మహిళల ఆరోగ్యం, సంరక్షణ, సంక్షేమంతో పాటు పలు కీలక అభివృద్ధి పథకాలల్లో మహిళలకే ప్రాధాన్యతనిచ్చామని తెలిపారు. మహిళల కేంద్రంగానే పథకాలను అమలు చేశామని చెప్పారు. తెలంగాణ ప్రగతిలో మహిళలను నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం భాగస్వామ్యం చేసిందని, అదే స్పూర్తిని కొనసాగిస్తూ మహిళా సాధికారతకు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. వారిని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడం ద్వారానే తెలంగాణ అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందని కెటిఆర్ తెలిపారు.