Thursday, July 4, 2024

ఆహ్వానంలోనూ అవమానం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రప్రభుత్వం నిర్వహించే దశాబ్ది వేడుకల్లో బిఆర్‌ఎస్ పాల్గొనడం లేదని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం బిఆర్‌ఎస్‌ను అడుగడుగునా అవమానించిందని, సిఎం రేవంత్ ప్రభుత్వం వికృత పోకడలను నిరసిస్తూ వేడుకల్లో పాల్గొనడం లేదని కెసిఆర్ లేఖలో పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం పంపిన నేపథ్యంలో ప్రజల పక్షాల లేఖ రాస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర దశాబ్ది అవతరణ ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంలో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి 22 పేజీల సుదీర్ఘ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర అవతరణ కాంగ్రెస్ దయాభిక్షగా ప్రచారం చేస్తున్నారని లేఖలో కెసిఆర్ పేర్కొన్నారు. తనకు వేదికపై స్థానం కల్పించకుండా అవమానించారని, ప్రసంగించే అవకాశం కల్పించకుండా అవమానించారని తెలిపారు. ఇది కాంగ్రెస్ అహంకార ఆధిపత్య ధోరణికి పరాకాష్ట అని, ఆహ్వానించినట్లే ఆహ్వానించి అవమానించదలిచారని పేర్కొన్నారు. తనను అవమానించే మీ దురుద్దేశాన్ని ప్రజలు గమనిస్తున్నారని లేఖలో సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు.

ఇకనైనా వైఖరిని మార్చుకుని సంక్షేమానికి పాటుపడాలి
రాష్ట్ర అవతరన సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమని, అమరుల త్యాగాల పర్యవసానమనీ కాకుండా.. కాంగ్రెస్ దయాభిక్షగా ప్రచారం చేస్తున్న ఆ పార్టీ భావ దారిద్య్రాన్ని నిరసిస్తున్నానని కెసిఆర్ లేఖలో పేర్కొన్నారు. ఇకనైనా వైఖరిని మార్చుకుని సంక్షేమానికి పాటుపడాలని సూచించారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో 369 మంది ముక్కుపచ్చలారని యువకులను కాల్చి చంపిన కాంగ్రెస్ దమననీతికి సాక్ష్యమే గన్‌పార్క్ అమరవీరుల స్థూపమని కెసిఆర్ తెలిపారు. ఆ స్థూపాన్ని కూడా ఆవిష్కరించుకో నివ్వకుండా అడ్డుపడిన కాంగ్రెస్ కర్కశత్వం తెలంగాణ చరిత్ర పుటల్లో నిలబడిపోయిందని అన్నారు. మలిదశ ఉద్యమంలోనూ వందలాది మంది యువకుల ప్రాణాలను బలిగొన్న పాపం నిశ్చయంగా కాంగ్రెస్ పార్టీదే అని పేర్కొన్నారు.

తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జరిగిన చారిత్రాత్మక ప్రయత్నమే టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం అని చెప్పారు. పార్లమెంటరీ రాజకీయ పంథాలో, శాంతియుత మార్గంలో తెలంగాణ సాధన లక్ష్యంగా టిఆర్‌ఎస్ ఏర్పడటం తెలంగాణ ఉద్యమంలో మేలుమలుపు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకుపోతున్నది ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో కెసిఆర్ పాల్గొనడం సమంజసం కాదని.. బిఆర్‌ఎస్ పార్టీతో సహా ఉద్యమకారులు, తెలంగాణ వాదులు అభిప్రాయంగా ఉందని కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News