Saturday, July 6, 2024

కాంగ్రెస్‌లో చేరిన కెకె

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కెకె కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కెకెకు ఖర్గే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.  బిఆర్‌ఎస్ పార్టీకి కెకె రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బిఆర్ఎస్ ఎంఎఎల్ లలో  దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి,  మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, తదితరలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News