Tuesday, September 17, 2024

దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలు: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఉత్సవ కమిటీ నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 70 ఏళ్లుగా నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించిన  ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి రేవంత్ అభినందనలు తెలిపారు. స్వర్గీయ పిజెఆర్ ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహాగణపతి వద్ద రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉత్సవ కమిటీల సమస్యలను తెలుసుకుంటామన్నారు. హైదరాబాద్ నగరంలో 1లక్షా 40వేల విగ్రహాలను ఏర్పాటు చేసి పూజిస్తున్నారని, గణేష్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయం తీసుకుందన్నారు. అకాల వర్షాలతో పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించిందని, అందరి పూజలు, దేవుడి ఆశీస్సులతో వరదల నుంచి బయటపడ్డామన్నారు. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నానని, ప్రతీ ఏటా ఉత్సవ కమిటీ ఎప్పుడు ఆహ్వానించినా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటానని రేవంత్ రెడ్డి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News