హైదరాబాద్: మెగా పవర్స్టార్ రామ్చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందబోతున్న క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్. ఈ పాన్ ఇండియా సినిమాను భారీ బడ్జెట్తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ఇందులో ఏ హీరోయిన్ నటిస్తుందోనని గత కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఊహాగాలకు చిత్రయూనిట్ చెక్ పెట్టింది. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని తీసుకున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో రెండోసారి చరణ్ సరసన కియారా అడిపాడనుంది. ప్రస్తుతం దర్శకుడు శంకర్ హైదరాబాద్లోనే ఉంటూ షూటింగ్కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు. వచ్చే నెల నుంచే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కావచ్చని అంటున్నారు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.
Joining us on this super exciting journey is the talented and gorgeous @advani_kiara !
Welcome on board ❤️#HappyBirthdayKiaraAdvani#RC15 #SVC50@ShankarShanmugh @AlwaysRamCharan @MusicThaman @SVC_official pic.twitter.com/u4RU0Fs2ee
— Sri Venkateswara Creations (@SVC_official) July 31, 2021
Kiara Advani pair with Ram Charan in Shankar Film