Saturday, October 5, 2024

పేదలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రతాపం:కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

పేదలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రతాపం చూపుతున్నారని బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. హైడ్రా పేరుతో కూల్చివేతలు ఆపాలని సీఎంకు విజ్ఞప్తి చేశామన్నారు. నాంపల్లిలోని బిజేపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో భారాస ప్రభుత్వం..మూసీ సుందరీకరణ చేయాలని ఆలోచించింది. ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే వెనక్కి తగ్గింది. డ్రైనేజీ సమస్య పరిష్కరించకుండానే మూసీ సుందరీకరణ చేయాలని చూస్తున్నారు. తాగునీరు, డ్రైనేజీ కలిసి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దని ప్రభుత్వాన్ని కోరాం. విధ్వంసాన్ని ఆపాలని సీఎంకు లేఖ రాశాను. ప్రజల ఆవేదనను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించడం న్యాయం కాదని కిషన్‌రెడ్డి అన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా కిషన్‌రెడ్డి స్పందించారు. ఆమె వ్యాఖ్యలను ఖండించారు. మహిళలు, కుటుంబాల గురించి మాట్లాడటం భారాస, కాంగ్రెస్ పార్టీలకు అలవాటైందని విమర్శించారు.

ఫోన్ ట్యాపింగ్‌లో సెలబ్రిటీలను టార్గెట్ చేశారు : నాగ చైతన్య-సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మర్యాదపూర్వకంగా మాట్లాడని నేతలను మీడియా సంస్థలు బహిష్కరించాలని అన్నారు. కుటుంబ వ్యవహారాలు , వ్యకిగత విషయాలు రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని కిషన్‌రెడ్డి అన్నారు. మర్యాదపూర్వకంగా మాట్లాడని నేతలను మీడియా సంస్థలు బహిష్కరించాలన్నారు. కుటుంబ వ్యవహారాలు, వ్యకిగత విషయాలు రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని కిషన్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరమని, ఒకరి సంభాషణను వినడం తప్పని అన్నారు. భార్య భర్తలు , వ్యాపార వేత్తలు, సెలబ్రిటీలను టార్గెట్ చేశారని ఆరోపించారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ మొదలు పెట్టారని, సీఎం రేవంత్ ఇప్పుడు కొనసాగిస్తున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కొడుకుకు అయితే అడ్డూ అదుపు లేదని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాష చాలా ఇబ్బందిగా ఉందని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతల వల్ల పేరు వస్తుందంటే కరెక్ట్ కాదన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశానని, కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో వేలాదిమంది పేదలు రోడ్డున పడే అవకాశం ఉందని హెచ్చరించారు. గతంలో బీఆర్‌ఎస్ అవలంభించిన విధానాలే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తోందని విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో వర్షపు నీరు ఎటు వెళ్తుందో చెప్పాలన్నారు. డ్రైనేజీ సిస్టం అంతా మూసీకి అనుసంధానం చేశారని కిషన్‌రెడ్డి అన్నారు. మూసీకి డైవర్ట్ చేసిన డ్రైనేజి వ్యవస్థ మీద ప్రత్యామ్నాయం చూపాలని అన్నారు. నిర్మాణాల కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డికి అంత తొందర ఎందుకో అర్థం కావడం లేదని కిషన్‌రెడ్డి చెప్పారు. ఇప్పుడు హైడ్రా కూలుస్తున్న ఇళ్లన్నీ ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మించినవేనని అన్నారు. కాంగ్రెస్ , బీఆర్‌ఎస్ దోపిడీ పార్టీలు , దొంగల పార్టీలు అని విమర్శించారు. అప్పుడు బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోపిడీలకు తెర లేపాయని ఆరోపించారు. హైడ్రా అంటే రేవంత్ రెడ్డి అని విమర్శించారు.

రేవంత్ రెడ్డి ఆలోచనకు హైడ్రా ప్రతి రూపమని, బడా బాబుల ఫామ్ హౌస్‌లు కూల్చాలని కిషన్‌రెడ్డి అన్నారు. ఫాతిమా కాలేజీని కూల్చకుండా ఎందుకు సమయం ఇచ్చారని ప్రశ్నించారు. ఎంఐఎం నాయకులకు సంబంధించిన వాటిని ఎందుకు కూల్చడం లేదని కిషన్‌రెడ్డి నిలదీశారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చిందని, ఆర్థిక ఇబ్బందుల్లో హిమాచల్ ప్రదేశ్ కొట్టుమిట్టాడుతోందని ఆరోపించారు. కర్ణాటకలో కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటోంద,ఇ ఆ రాష్ట్రాల తర్వాత తెలంగాణ కోలుకోలేని ఆర్థిక ఇబ్బందిని చూడబోతుందని హెచ్చరించారు. హైడ్రా కోసం విధి విధానాలు రూపొందించే సమయంలో ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సలహా ఇచ్చారు. ఇళ్లను కూల్చి వేసే సమయంలో పసి పిల్లల అర్తనాథలు రేవంత్ రెడ్డికి వినిపించడం లేదా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News