Sunday, February 23, 2025

ఒకే మ్యాచ్‌లో ఇద్ద‌రు కెప్టెన్ల‌కు జ‌రిమానా..

- Advertisement -
- Advertisement -

లక్నోలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో తమ జట్లు స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు లక్నో సూపర్ జెయింట్స్ సారథి కెఎల్ రాహుల్, అతని చెన్నై సూపర్ కింగ్స్ కౌంటర్ రుతురాజ్ గైక్వాడ్‌లకు ఒక్కొక్కరికి రూ.12 లక్షల జరిమానా పడింది. శుక్రవారం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జి డిఫెండింగ్ ఛాంపియన్ సిఎస్‌కెపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. మినిమమ్ ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి ఐపిఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్‌లో జట్లు చేసిన మొదటి నేరం కావడంతో, రాహుల్, రుతురాజ్ ఇద్దరికీ 12 లక్షల జరిమానా విధించినట్లు ఐపిఎల్ ప్రకటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News