Tuesday, September 17, 2024

కెఎల్ రాహుల్ సంచలన నిర్ణయం!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్‌కు సంబంధించిన ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో రాహుల్ బరిలోకి దిగాడు. త్వరలో జరిగే దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌లో కూడా అతనికి చోటు లభించింది. కానీ అతను ఇటీవల రాహుల్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు హాల్‌చల్ చేస్తోంది. త్వరలో ఓ ప్రకటన చేయబోతున్న.. ఇదీ ఆ పోస్టు సారాంశం. దీంతో రాహుల్ త్వరలోనే క్రికెట్‌కు వీడ్కోలు పలకడం ఖాయమని వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.

రాహుల్‌కు సంబంధించిన ఈ పోస్టును ఓ యూజర్ షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారిపోయింది. చాలా మంది అభిప్రాయాలను పరిగిణలోకి తీసుకున్నాక నా నిర్ణయం ప్రకటిస్తున్నా. ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నా. ఇలా ప్రకటించడం అంత సులువేం కాదు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదు. నా జీవితంలో క్రీడలు భాగమైపోయాయి. నాకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు, అభిమానులకు ధన్యవాదాలు. మైదానంలో బయట ఎన్నో అనుభవాలు ఉన్నాయి. క్రికెట్‌కు నా జీవితంలో ప్రత్యేక స్థానముంది. కానీ, ప్రస్తుతం తానున్న పరిస్థితుల్లో క్రికెట్‌లో కొనసాగడం కష్టంగా మారింది. దీంతో ఈ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడమే మంచిదనే నిర్ణయానికి వచ్చా అంటూ రాహుల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును ఓ యూజర్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది భారత క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News