Thursday, July 4, 2024

క్రైమ్ థ్రిల్లర్ ‘కోడి బుర్ర’ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ఒకరికి ఒకరు, రోజాపూలు, స్నేహితులు, రాగల 24 గంటల్లో వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో శ్రీరామ్ కొత్త మూవీ ‘కోడి బుర్ర‘ హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని వీ4 క్రియేషన్స్ బ్యానర్‌లో కంచర్ల సత్యనారాయణరెడ్డి, గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్ గౌడ్ నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్నారు. శృతి మీనన్, ఆరుషి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మహావీర్ మరో కీ రోల్ పోషిస్తున్నారు.

కోడి బుర్ర సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతిథిలుగా పాల్గొన్న ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ క్లాప్ నివ్వగా దర్శకుడు భరత్ కమ్మ స్క్రిప్ట్ అందజేశారు. అనంతరం దర్శకుడు చంద్రశేఖర్ కానూరి మాట్లాడుతూ “ఈ చిత్రంలో శ్రీరామ్‌ని కొత్తగా చూస్తారు. ఆయన ఇప్పటిదాకా లవ్, రొమాంటిక్ తరహా చిత్రాలు చేశారు. కోడి బుర్ర సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు.

హీరోయిన్ శృతి మీనన్ డాక్టర్ రోల్ చేస్తోంది. కోడి బుర్ర అందరికీ నచ్చేలా మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా అవుతుందని నమ్ముతున్నాం ”అని అన్నారు. హీరో శ్రీరామ్ మాట్లాడుతూ -“మా డైరెక్టర్ చంద్రశేఖర్… కోడి బుర్ర చిత్రాన్ని అందరికీ నచ్చేలా ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. శృతి మీనన్ తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. ఆరుషి మంచి రోల్ చేస్తోంది”అని తెలిపారు. ఈ వేడుకలో హీరోయిన్లు శృతి మీనన్, ఆరుషి, నిర్మాతలు గట్టు విజయ్, కంచర్ల సత్యనారాయణరెడ్డి, నటుడు మహావీర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News