Sunday, February 23, 2025

నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా: కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ.. నిన్ను ఎవరూ కాపాడలేరు అంటూ బిజెపి నేత, మాజీ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి వ్యాఖ్యనించారు. తనపై ఎంఎల్‌సి కవిత చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటరిచ్చారు. కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో తనపై విష ప్రచారం చేశారని కోమటిరెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో తనను రాజకీయంగా ఎదుర్కొనలేకే బిఆర్‌ఎస్ నాయకులు తనపై ఆరోపణలు చేశారని ఆయన మండిపడ్డారు. పారదర్శకంగా టెండర్ ద్వారా వచ్చిన రూ.18000 కోట్ల కోల్‌బ్లాక్ టెండర్ విషయంలో తనపై విష ప్రచారం చేసి, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News